Anti Paper Leak Bill :  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కఠినమైన పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అమెండ్‌మెంట్ బిల్లు (యాంటీ పేపర్‌ లీక్‌ సవరణ బిల్లు) లోక్‌సభలో ఆమోదం పొందింది. ఈ బిల్లును మూజువాణి ఓటుతో లోక్‌సభ ఆమోదించింది. అలాగే లోక్ సభలో వందేమాతరం బిల్లుకు ఆమోదం తెలిపింది. అనంతరం లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. పరీక్షల నిర్వహణలో అక్రమాలకు పాల్పడే వ్యక్తులకు కనీసం 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు రూ. 50 లక్షల వరకు జరిమానా విధించేలా నిబంధనలు పొందుపరిచారు. పేపర్ లీక్ మాఫియా లేదా నేరాలకు పాల్పడే వ్యక్తులు, సంస్థలకు కనీసం 7 సంవత్సరాల జైలు శిక్ష, రూ. 10 కోట్ల వరకు భారీ జరిమానా విధించనున్నారు. పేపర్ లీక్ కేసులను త్వరగా విచారించి బాధ్యులకు త్వరగా శిక్షలు ఖరారు చేసేందుకు ప్రతి రాష్ట్రంలో ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనున్నారు. ఈ కేసుల దర్యాప్తును రెండు నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పరీక్షల నిర్వహణలో విఫలమైన లేదా అక్రమాలకు సహకరించిన ప్రైవేట్ సర్వీస్ ఏజెన్సీలపై జరిమానాతో పాటు వాటిపై నిషేధ కాలం మరింత పెంచబడింది.

Also Read : అరుణాచలం మోక్షమార్గంలో కొత్త రూల్స్.. కచ్చితంగా పాటించాల్సిందే!

Also Read : పరారీకి ప్రయత్నించిన గ్యాంగ్ రేప్ నిందితులు.. కస్టడీలోనే ప్రజల దాడి

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.